
డీడీఆర్ఎఫ్ఓగా సింహాచలం
పార్వతీపురంటౌన్: జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారిగా పి.సింహాచలం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విపత్తులు, వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. జిల్లాలోని నాలుగు అగ్నిమాపక కేంద్రాల పరిస్థితి, సిబ్బంది, మౌలిక సదుపాయాలను ఆరా తీశారు.
సచివాలయ ఉద్యోగుల నిరసన
సాక్షి, పార్వతీపురం మన్యం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. సచివాలయ ఉద్యోగుల జాబ్చార్ట్ను తక్షణమే ప్రకటించాలని, రేషనలైజేషన్కు సంబంధించి మిగులు ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగోన్నతులు, పెండింగు బకాయిల విడుదల చేయాలని కోరారు. సచివాలయ శాఖకు చట్టబద్ధత కల్పించాలన్నారు. డిమాండ్లన్నీ పరిష్కరించిన తర్వాతే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్టీఐ విభాగంలో పదవులు దక్కాయి. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన దేవుపల్లి నాగరాజును జనరల్ సెక్రటరీగా, కురుపాం నియోజకవర్గానికి చెందిన చందక వెంకటేశ్వరరావును సెక్రటరీగా నియమిస్తూ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి.
ఆశ కార్యకర్తల నియామకాలకు నోటిఫికేషన్ జారీ
పార్వతీపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా 34 మంది ఆశ కార్యకర్తల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసినట్టు డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామీణ, గిరిజన గ్రామ సచివాలయాల పరిధిలో ఆశ కార్యకర్తల నియామకానికి ప్రభు త్వం అనుమతించిందన్నారు. సచివాలయం పరిధికి చెందిన 25–45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వివాహితులు, వితంతువులకు నియామకాల్లో ప్రాధాన్యమిస్తామన్నారు. 10వ తరగతి చదివి, తెలుగు చదవడం, రాయడం వచ్చినవారు దరఖాస్తులను జూలై 5లోగా సంబంధిత పీహెచ్సీల్లో అందజేయాలని కోరారు.