
ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్
పూసపాటిరేగ: పూసపాటిరేగ ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్ను నియమిస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. సాక్షి దినపత్రికలో ‘తహసీల్దార్ ఎక్కడ?’ శీర్షికన బుధవారం కథనం వెలువడింది. దీనిపై స్పందించిన రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు పూసపాటిరేగ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవకుమార్కు ఇన్చా ర్జ్ బాధ్యతలు అప్పగించారు. పదిరోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి రెవెన్యూ సేవలు అందకపోవడంతో విద్యార్థులు, వివిధ అవసరా ల నిమిత్తం వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు తహసీల్దార్ బాధ్యతలు ఇన్చార్జికి అప్పగించడంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి.