
ల్యాప్టాప్స్,సెల్ఫోన్ దొంగల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : సెల్ఫోన్, ల్యాప్టాప్లను దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమిళినాడు రాష్ట్రంలోని ఉదయరాజపాల్యంకు చెందిన మురుగన్ వెంకటస్వామి, గణేష్లను ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయ రాజ పాల్యంకు చెందిన ఇద్దరు వ్యక్తులు నగరంలోని వీటీ అగ్రహరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నగరంలోని స్టూడెంట్స్ రూమ్స్ లక్ష్యంగా చేసుకుని ల్యాప్ టాప్లు, సెల్ఫోన్ల అపహరణకు పాల్ప డేవారు. ఇలా విజయనగరంలోని కోటవీధి, కాటవీధి, విశాఖలోని పీఎంపాలెం వద్ద గల స్టూడెంట్స్ రూమ్ లలో దొంగతనాలకు పాల్ప డ్డారు. అయితే ఈ నెల ఆరవ తేదీన విజయనగరంలోని శివాలయం వీధికి చెందిన ఓ వ్యక్తి ల్యాప్టాప్, రెండు సెల్పోన్లు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ పార్టీని రంగంలోకి దించామని టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ క్రమంలోనే స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా ఈ ఇద్దరు నిందితులు నేరం చేసినట్లు నిర్థారణ అయిందన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. విచారణలో మొత్తం 57 సెల్ ఫోన్లు, 16 ల్యాప్టాప్లు, రెండు ఆపిల్ ఐ ప్యాడ్లు దొంగతనం చేసి అమ్మేసినట్లు నిందితులు అంగీకరించారని సీఐ చెప్పారు.
20 లీటర్ల సారా స్వాధీనం
పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలసలో అక్రమంగా సారా విక్రయిస్తున్న చోడిపల్లి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విక్రయానికి సిద్ధంగా ఉంచిన 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సారాను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.