డైవర్షన్‌ పాలిటిక్స్‌! | - | Sakshi
Sakshi News home page

డైవర్షన్‌ పాలిటిక్స్‌!

Jun 25 2025 1:23 AM | Updated on Jun 25 2025 1:37 AM

–8లో
పిల్లల ప్రమాద ఘటనపైనా..

బుధవారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి, పార్వతీపురం మన్యం:

పాపం.. చిన్నారులు! తమ బడి కోసం ఎంతో దూరం నుంచి కలెక్టరేట్‌కు వచ్చారు. వారితోపాటు.. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలూ ఉన్నారు. నిజమే.. స్వతహాగా ఆలోచించే నిర్ణయం తీసుకునే వయస్సు ఆ చిన్నారులది కాకపోవచ్చు. తమ బిడ్డల భవిష్యత్తుపైన తల్లిదండ్రులకు కచ్చితంగా భయం ఉంటుంది కదా!! ఊరి బడిని దూరం చేస్తామంటే.. తమ పిల్లలు ఎక్కడ తల్లడిల్లిపోతారో అని ఆ తల్లిదండ్రులు ఆలోచించారు. 3, 4, 5 తరగతులకు మరో ప్రాంతం వెళ్లాలంటే.. ఆ వయసులో కష్టమని భావించారు. అందుకే, మూకుమ్మడిగా తమ పిల్లలనే తీసుకుని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి ధర్నా చేపట్టారు బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు. వీరి పోరాటం కొన్ని నెలలుగా సాగుతోంది. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నాలుగు రోజుల కిందట అక్కడ ఎంఈవో కార్యాలయం ఎదుటా ధర్నా చేశారు. ఆ సమయంలో ఎంఈవో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన విషయాన్ని చెబుతూ, పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పిద్దామని సర్దిచెప్పారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. ఈ నెల 23న ఓ వామపక్ష నాయకుడి సహకారంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్‌ వద్ద పిల్లలతో కలసి ఉదయం 11 నుంచి గంటకుపైగా సమయం ధర్నా చేశారు.

అదే సమయంలో ‘యువతపోరు’ కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్యే జోగారావు

అదే సమయంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని వైఎస్సార్‌ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితరులు భారీ ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్‌ వెలుపలే పోలీసులు చాలాసేపు వారిని నిలువరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జోగారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు కొంతమంది పీజీఆర్‌ఎస్‌కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న పెదపెంకి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తమ ఆవేదనను ఆయనకు వినిపించారు. పాఠశాల విషయమై పీజీఆర్‌ఎస్‌లోనే ఇన్‌చార్జి డీఈవోతో జోగారావు మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో ‘యువత పోరు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఆవేదన కూడా వినాలని మీడియా ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. లోకేశ్‌ మామా.. తమ బడిని కాపాడాలని నమస్కారాలు పెడుతూ వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు వినతిపత్రం అందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆ కార్యక్రమం ముగిసిపోయింది. ఎవరికి వారు వెళ్లిపోయారు.

న్యూస్‌రీల్‌

ప్రమాదాన్నీ

రాజకీయం చేసి..

అక్కడ నుంచి డీఈవో కార్యాలయానికి..

కలెక్టరేట్‌ నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారని సమాచారం. అనంతరం సాయంత్రం సమయంలో తాము వచ్చిన ఆటోలపైనే స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో కొంతమంది పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘటనా స్థలానికి చేరుకుని, వారిని ఆస్పత్రికి తరలించారు.

విద్యార్థుల ప్రమాదాన్ని.. మాజీ ఎమ్మెల్యేనే వారిని స్వయంగా ధర్నాకు తీసుకెళ్లారని తప్పుడు ప్రచారంతో ఓ వ్యక్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్‌ చేస్తూ, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనతో ఏ సంబంధమూ లేని ఎంఈవో, హెచ్‌ఎంలపై చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేశాడు. ఆ వ్యక్తి చెప్పింది నిజంగా భావించిన మంత్రి లోకేశ్‌.. ఘటనపై చింతిస్తూ, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సోషల్‌ మీడియా వేదికగా ఆదేశించారు. వాస్తవాలు తెలిసి కూడా ఎల్లో మీడియా సైతం మాజీ ఎమ్మెల్యేపైనే నిందలు వేస్తూ దుష్ప్రచారానికి దిగింది. విద్యార్థుల ప్రమాద ఘటన మానవత్వం ఉన్న ఏ ఒక్కరికై నా దిగ్భ్రాంతి కలిగించకమానదు. బహుశా మంత్రి లోకేశ్‌ కూడా తక్షణం ఆ విధంగానే స్పందించి ఉంటారు. విద్యార్థులతో రాజకీయాలు చేయవద్దంటూ సూచించారు. ఇదే అదునుగా వాస్తవాలను కప్పిపుచ్చి, స్థానిక కూటమి నాయకులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యేనే విద్యార్థులను ధర్నాకు తీసుకొచ్చారని సోషల్‌ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టారు. దీనికి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా జత కలిసి అదే తరహాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే పెదపెంకి–1 పాఠశాలలో 3, 4, 5 తరగతులు మరోచోటకు విలీనం అయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్లే.. ఆ ఊరి పిల్లలకు, తల్లిదండ్రులకు చదువు బెంగ పట్టుకుంది. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్లే.. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో ధర్నాలకు దిగారు. వీరి నిర్వాకాన్ని కప్పిపుచ్చి, ఒక ప్రమాద ఘటనను వైఎస్సార్‌సీపీపై నెట్టి, డైవర్షన్‌ పాలిటిక్స్‌కు కూటమి నేతలు తెర తీశారు. పాఠశాల ఉంచుతారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వకుండా అనవసర విషయాలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

కూటమి నేతల కుఠిల రాజకీయాలు

శకునికి మించి వ్యూహాలు

తమ బడి కోసం కలెక్టరేట్‌కు స్వచ్ఛందంగా వచ్చిన పెదపెంకి విద్యార్థులు

తిరిగి వెళ్తుండగా ప్రమాదం

ఘటనకు, మాజీ ఎమ్మెల్యే జోగారావుకు ముడిపెడుతూ దుష్ప్రచారం

డైవర్షన్‌ పాలిటిక్స్‌! 1
1/2

డైవర్షన్‌ పాలిటిక్స్‌!

డైవర్షన్‌ పాలిటిక్స్‌! 2
2/2

డైవర్షన్‌ పాలిటిక్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement