
క్రీడాకారులకు అండగా ఉంటాం
పాలకొండ: క్రీడాకారులకు అండగా ఉంటామని కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు అన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ అండర్–18 జట్టుకు ఎంపికై న రాష్ట్ర క్రీడాకారులకు మంగళవారం ఆయన అవసరమైన బ్యాగులు, కిట్లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 10 రోజులుగా ఇక్కడ శిక్షణ పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న హరిద్వార్లో జరగనున్న జాతీయస్థాయి అండర్–18 పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మంగళవారం ఇక్కడి నుంచి బయలు దేరారు. ఈ సందర్భంగా క్రీడాకారులు కొండలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్, మాజీ క్రీడాకారులు దూబ వెంకటరమణ, మాజీ పీఈటీ రెడ్డి మాస్టర్ తదితరులు ఉన్నారు.