పొదుపు సంఘాల లక్ష్యంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాల లక్ష్యంలో ప్రభుత్వం విఫలం

Jun 25 2025 1:23 AM | Updated on Jun 25 2025 1:23 AM

పొదుపు సంఘాల లక్ష్యంలో ప్రభుత్వం విఫలం

పొదుపు సంఘాల లక్ష్యంలో ప్రభుత్వం విఫలం

విజయనగరం గంటస్తంభం: ఏ లక్ష్యంతో పొదుపు సంఘాలు పెట్టారో ఆ లక్ష్యం నేరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్‌.రమణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె.పుణ్యవతి ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌పీఆర్‌ భవనంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ..డ్వాక్రా సంఘాలను ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. పొదుపు చేసిన డబ్బులే రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు బ్యాంకులో ఇవ్వడం సరికాదన్నారు. సీ్త్ర నిధి రుణాల్లో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. సక్రమంగా కట్టినా అఽధిక వడ్డీలు తీసుకుంటు న్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని కళ్లేపల్లి గ్రామంలో రూ.18 లక్షల వరకు అవినీతి జరిగితే ఐద్వా పోరాడి డబ్బులు సుమారు రూ.13 లక్షలు వరకు ఇప్పించినట్లు చెప్పారు. పెన్షన్‌ ఇస్తామని చెప్పి మహిళల దగ్గర వసూలు చేసిన అభయ హస్తం డ బ్బులు ఏమయ్యామని ప్రశ్నించారు. అత్యధిక బ్యాంకులు డ్వాక్రా మహిళాలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. అప్పును సక్రమంగా కట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు డ్వాక్రా మహిళలేనన్నారు. పొదుపు మహిళల సమస్యలు పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు పుణ్యవతి, లక్ష్మి, సహాధ్యక్షురాలు ఆర్‌.కృష్ణవేణి, జిల్లా కమిటీ సభ్యులు జి.అరుణ, కరుణ పాల్గొన్నారు.

ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement