
ప్రయాణికుల ప్రయాస
ఆర్టీసీ బస్సుల్లో అధికశాతం విశాఖపట్నంలోని యోగాంధ్ర కార్యక్రమానికి తరలించడంతో విజయనగరం జిల్లా ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. ఆర్టీసీ కాంప్లెక్స్లోనే బస్సుల కోసం పడిగాపులు కాశారు. కొందరు ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కాంపెక్స్లోనే ఉండిపోయారు. బస్సులన్నీ యోగాంధ్రకు తరలించడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్కు వచ్చిన అరకొర బస్సుల్లో ఎక్కేందుకు పోటీపడ్డారు. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం

ప్రయాణికుల ప్రయాస