
22న జాబ్మేళా
నెల్లిమర్ల: పట్టణంలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 22న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్కుమార్ శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు.జిల్లా నైపుణ్యాభివృద్ధిసంస్థ, ప్రభుత్వ జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్మేళాకు హాజరుకావాలని సూచించారు.12 బహుళ జాతి కంపెనీలు మేళాలో పాల్గొంటాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను httpr://naipunyam.ap.gov.inఅనే వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.
సారా అమ్మకాలపై దాడులు
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా సారా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 60 లీటర్ల సారాతో చినమేరంగి గ్రామానికి చెందిన వ్యక్తి పట్టుబడడంతో అదుపులోకి తీసుకున్నారు. సారా రవాణాకు ఉపయోగించిన పల్సర్బైక్ను సీజ్ చేసినట్లు సీఐ చెప్పారు. సారా సరఫరా చేస్తున్న రాయగడ జిల్లా కెరడ గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తులు
పార్వతీపురం టౌన్: జిల్లా పరిధిలో సమగ్ర శిక్ష మండల స్థాయిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమగ్ర శిక్ష ఏపీసీఎస్ వరల్డ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, సైట్ ఇంజినీర్లు తదితర పోస్టులకు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులతో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ సిబ్బంది సంబంధిత ప్రిన్సిపాల్తో కౌంటర్ సైన్ చేయించాలని సూచించారు. జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈనెల 21 వరకు కార్యాలయం పని వేళల్లో దరఖాస్తులు అందించాలని స్పష్టం చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయనగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన బమ్మిడి పైడిరాజు(50) హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన పైడిరాజు బైక్పై నాతవలస వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మపురి రోడ్డులో సుగర్ డౌన్ అయ్యి కళ్లు తిరిగి పడిపోయాడని ఎస్సై అశోక్ తెలిపారు. స్థానికుల సహాయంతో వైజాగ్లోని మెడికవర్ ఆస్పత్రిలో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. పైడిరాజు కుమార్తె కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.

22న జాబ్మేళా

22న జాబ్మేళా