
మారిక విద్యార్థుల సమస్యలు తీరవా?
● పాఠశాలకు భవనం లేక చెట్ల కిందనే తరగతులు
● చర్చి వరండాలో మధ్యాహ్న భోజనం
వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీలో ఎత్తైన గిరిశిఖరంపై ఉన్న మారిక గిరిజన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నా భవనం లేకపోవడంతో చెట్టుకిందనే పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల బదిలీ ప్రకియలో బదిలీపై మారిక పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుల విద్యాబోధనపై గిరిజనులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తమారిక, పాతమారిక తండాలకు సంబంధించి 27 మంది పిల్లలకు భవనం లేకపోవడంతో ఉపాధ్యాయులు చెట్ల కిందనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్చి వరండాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భోజనాలు పెట్టినట్లు ఉపాధ్యాయుడు రాంబాబు తెలిపారు. అలాగే ఎస్ఎంఎస్ సభ్యులతో కిచెన్ గార్డెన్తయారు చేయించడం ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు మంచి బోధన అందించాలన్న తపనతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు కనీస సౌకర్యాలైన పాఠశాల పక్కాభవనం, మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మారిక విద్యార్థుల సమస్యలు తీరవా?