ఘనంగా రెవెన్యూ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రెవెన్యూ దినోత్సవం

Jun 21 2025 3:41 AM | Updated on Jun 21 2025 3:41 AM

ఘనంగా రెవెన్యూ దినోత్సవం

ఘనంగా రెవెన్యూ దినోత్సవం

విజయనగరం అర్బన్‌: రెవెన్యూ అధికారులు చట్టాలపై అవగాహన కల్పించుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. రిటైర్‌ అయిన ఉద్యోగుల అనుభవాలను తెలుసుకుని సమర్థతను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ దినో త్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సిబ్బంది, అధికారులతో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. రెవెన్యూ శాఖలో రిటైర్‌ అయిన అటెండర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకు పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించా రు. కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, ఆర్‌డీఓలు ఆశయ్య, రామ్‌మోహన్‌రావు, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బాలాత్రిపుర సుందరి, రిటైర్డ్‌ డీఆర్‌ఓ గణపతిరావు, రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.గోవింద, సూర్యనారాయణ, అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ అధికారులకు సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement