బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ103 శ్రీ176 శ్రీ186
కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి
● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
విజయనగరం ఫోర్ట్: కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్టు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. దీనికోసం గ్రామ స్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు వచ్చినట్టు తెలిపారు. విజయనగరం మెసానిక్ టెంపుల్లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసినది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు. కూటమి ప్రభుత్వం రాజధానిపై పోరాటం చేస్తే హౌస్ అరెస్టు చేశారని, స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తే దీక్ష భగ్నం చేశారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్, డాక్టర్ గేదెల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
హోటళ్లపై 6ఎ కేసు నమోదు
డెంకాడ: మండలంలోని రెండు హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 6ఎ కేసు నమోదు చేశారు. ఈ మేరకు చింతలవలస పరిధి ఉన్న 99 ద రాయల్ బిర్యానీ హౌస్, జొన్నాడ వద్ద ఉన్న ద్వారకా హోటల్లో విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, సిబ్బంది గురువారం తనిఖీ చేశారు. ఇంటిలో వినియోగించాల్సిన ఎల్పీజీ సిలిండర్లను హోటల్లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 99 ద బిర్యాని హౌస్లో 6 సిలిండర్లు, ద్వారకా హోటల్లో 5 సిలిండర్లను పట్టుకుని 6ఎ కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. పట్టుకున్న సిలిండర్లను సాయి గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ కిరణ్, వీఆర్వోలు కన్నయ్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు రెవెన్యూ దినోత్సవం
పార్వతీపురంటౌన్: రెవెన్యూ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ డే సందర్భంగా ప్రతి రెవెన్యూ కార్యాలయంలో వేడుకలు జరుగుతాయన్నారు. ఈ వేడుకల్లో రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ వివరించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
డెంకాడ: విజయనగరం–నాతవలస ఆర్అండ్బీ రహదారిపై డెంకాడ మండలం పెదతాడివాడ కూడలి సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చిత్తూరు జిల్లాకు చెందిన యానాది రవి(36) మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యానాది రవి, బావ కంతలచెరువు గోపి ఈ నెల 13వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ఐషర్వ్యాన్లో టమాటో లోడ్తో విజయనగరం వచ్చారు. 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో అన్లోడ్ చేశారు. అక్కడి నుంచి ఐషర్ వాహనం యజమానికి ఫోన్చేయగా పెదతాడివాడ వద్ద ఉన్న న్యూ వెంకట్ మినీ ట్రాన్స్పోర్టు కార్యాలయానికి వెళ్లి చిత్తూరు ఏమైనా కిరాయి ఉంటే చేసుకుని రావాలని చెప్పారు. దీనిలో భాగంగా యానాది రవి, బావ కంతలచెరువు గోపి పెదతాడివాడ వచ్చి ఉన్నారు. 18వ తేదీ రాత్రిభోజనం అనంతరం 11:30 గంటల సమయంలో ఫోన్ పట్టుకుని రవి బయటకు వెళ్లగా, గోపి వాహనంలో సేదదీరుతున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. చీకటిలో వెళ్లి వెతకగా రవి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వచ్చి రక్తపు మడుగులో ఉన్న యానాది రవిని పరీక్షించారు. అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారని మృతుడి బావ కంతలచెరువు గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. ఐషర్ వాహనంలో గోపి డ్రైవర్గా, రవి క్లీనర్గా పని చేస్తున్నారు. మృతుడు యానాది రవి చిత్తూరు జిల్లా బైరెడ్డిపాలెం మండలం నెల్లిపట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
చికెన్
చికెన్