
జోగిందొరవలసకు ఝలక్..!
● తొలుత మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తింపు, తర్వాత రద్దు
● మౌలికవసతులు లేని కారణంగా జాబితా నుంచి తొలగింపు
● నష్టపోతున్న గిరిజన విద్యార్థులు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది రామభద్రపురం మండలకేంద్రలోని పూడివీధి ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 54 మంది పిల్లలు చదువుతుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే విద్యాబోదన చేస్తున్నారు.ఈ పాఠశాల మోడ్ ప్రైమరీ పాఠశాలకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.ఈ పాఠశాలను కూడా మొదట్లో మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తించారు,ఆ తర్వాత పంచాయతీలో ఇప్పటికే మూడు మోడల్ ప్రైమరీ పాఠశాలలను గుర్తించాం. నాలుగోది వద్దు అని రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయాలతో పిల్లలు నష్టపోతున్నారని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు.

జోగిందొరవలసకు ఝలక్..!