
బోర్డులు మార్చండి ప్లీజ్..!
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో విస్తరించిన అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు సరైన దిశగా లేకపోవడంతో వాహన చోదకులు అత్యంత వేగంగా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. హార్న్ కొట్టాల్సిన ప్రాంతంలో సూచిక లేక స్కూల్ జోన్ల వద్ద నిర్దిష్ట వేగంతో వెళ్లక, మలుపులను గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ప్రజారవాణాకు సంబంధించిన, అలాగే ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే భారీ నుంచి అతిభారీ వాహనాలు వందల సంఖ్యలో ఈ రహదారిపై రాకపోకలు కొనసాగిస్తాయి. ఇప్పటికే రహదారిపై ఉన్న సూచికలు దిశ మార్చుకుని సక్రమంగా లేకపోవడంతో సరైన దిశలో వాటిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
అస్తవ్యస్తంగా సూచిక బోర్డులు