సంతృప్తికరమైన జీవనశైలికి యోగా దోహదం | - | Sakshi
Sakshi News home page

సంతృప్తికరమైన జీవనశైలికి యోగా దోహదం

Jun 20 2025 6:29 AM | Updated on Jun 20 2025 6:29 AM

సంతృప్తికరమైన జీవనశైలికి యోగా దోహదం

సంతృప్తికరమైన జీవనశైలికి యోగా దోహదం

గంట్యాడ: భారతీయల వారసత్వ సాంస్కృతిక సంపదైన యోగాను యావత్‌ ప్రపంచం అనుసరిస్తోందని తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు గురువారం మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. యోగా ప్రతిరోజూ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు. విద్యార్థులు వారి జీవనంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవన రాణి, పర్యాటక అధికారి కుమారస్వామి, జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ ఎం.ఆనందరావు, మెప్పా పీడీ చిట్టిరాజు, ఎంపీడీఓ రమణమూర్తి, సీడీపీఓ ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement