శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 20 2025 6:27 AM | Updated on Jun 20 2025 6:27 AM

శుక్ర

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

300 యూనిట్లు వినియోగం లేకున్నా.. ఉన్నట్లు రిమార్కు

పరిశీలించకుండానే

పంపించేస్తున్న సచివాలయ సిబ్బంది

విద్యుత్‌ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న

తల్లిదండ్రులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

ల్లికి వందనం పథకంలో కొర్రీలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జాబితాలో తప్పులు కూడా చాలా మందిని అనర్హులుగా మిగిల్చాయి. భూమి లేకున్నా అధిక శాతం మందికి ఉన్నట్లు, విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటినట్లు సచివాలయాల వద్ద జాబితాల్లో చూపుతోంది. జిల్లాలో 1,08,951 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి కలిగిన విషయం విదితమే. వీరికి రూ.13 వేలు చొప్పున నిధులు జమయ్యాయి. ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ పథకం వర్తింపజేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన మరింత మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. ఇంకా వేలాది మంది ఉంటారని అంచనా. వారంతా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

విద్యుత్‌ బిల్లులు

ఎక్కువ చూపడంతో..

జాబితాలో తప్పుల వల్ల అధిక శాతం మంది అర్హత కోల్పోయారు. ప్రధానంగా నెలకు వంద యూనిట్లు వినియోగిస్తున్న వారికి కూడా 300 యూనిట్లు వినియోగిస్తున్నట్లు రిమార్కుల్లో చూపుతున్నారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడి సిబ్బంది కనీసం పరిశీలించకుండానే విద్యుత్‌ కార్యాలయం వద్దకు వెళ్లాలని చెప్పి పంపించేస్తున్నారు. అక్కడ నుంచి ఏడాది వినియోగపు ధ్రువపత్రం తీసుకురావాలని చెబుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్‌ సెక్షన్‌ కార్యాలయాల్లో ఈఆర్‌వోలు, ఏఈవోలు, ఏఈలు వీటిని జారీ చేస్తారు. 300 యూనిట్లు ఎవరికీ వాడకం లేకున్నా.. సచివాలయ సిబ్బంది అందరితోనూ తెప్పిస్తుండటం వల్ల ప్రతిరోజూ విద్యుత్‌ సంస్థ కార్యాలయం వద్ద తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. వందలాది మందికి ఒకేసారి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి రావడంతో అక్కడి సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది విద్యుత్‌ శాఖ సిబ్బంది తప్పిదాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 300 యూనిట్లు దాటి వినియోగిస్తున్న వారికి కూడా తక్కువగా ‘సర్దుబాటు’ చేసి, సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు సడలించి, అందరికీ వందనం వర్తింపజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మారికవలస మీదుగా తిమ్మాపురం బీచ్‌కు బస్సురూట్‌

జిల్లాకు 30 కంపార్ట్‌మెంట్‌లు

● 4 చోట్ల పార్కింగ్‌ స్థలాల కేటాయింపు

పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన కలెక్టర్‌, ఎస్పీ

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/3

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 20252
2/3

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 20253
3/3

శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement