
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాల గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా పరిధిలోని 8, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని 5 పాఠశాలల్లో గురు వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి తరగతికి సంబంధించిన ప్రశ్నపత్రం ముందు తరగతి గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ సిలబస్ ఆధారంగా రూపొందించి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 89858 83015, 63038 38657 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఉమ్మడి విజయనగ రం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మిగులు సీట్ల ప్రవేశాల కోసం ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రూపావతి చెప్పారు. బాలికలకు ఈ నెల 22న చీపురుపల్లి బాలికల గురుకుల పాఠశాలలోను, బాలురకు ఈ నెల 23న కొప్పెర్ల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియట్ మిగులు సీట్లకు బాలికలకు ఈ నెల 26న నెల్లిమర్ల గురుకుల పాఠశాలలోను, బాలురకు 27న కొప్పెర్ల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
22 నుంచి 5వ తరగతి, ఇంటర్మీడియట్
మిగులు సీట్లకు కౌన్సెలింగ్
ఉమ్మడి విజయనగరం జిల్లా
సమన్వయకర్త ఎస్.రూపావతి

గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం