
యోగాంధ్రకు సమాయత్తం కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సమాయ త్తం కావాలని మండల ప్రత్యేక అధికారులు, జిల్లా, మండల అధికారులను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యోగాంధ్ర, స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర, డీఎ జుగా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నారని, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 3,150 వేదికల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 5.42 లక్షల మంది యోగాంధ్రకు రిజిస్టర్ చేసుకున్నారని, వీరంతా ఆ రోజు పాల్గొనేలా అధి కారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీవేదిక వద్ద బ్యాక్ డ్రాప్ బ్యానర్, సౌండ్ సిస్టం, ప్రత్యక్ష ప్రసారం, గ్రీన్ మ్యాట్ ఇతరత్రా ఏర్పాట్లు ఉండాలని, ఆ రోజు ఉదయం 6 గంటలకే అందరూ సిద్ధంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల ను కోరారు. యోగా చేసే సమయంలో క్వాలిటీతో కూడిన ఫొటోలు, వీడియోలు తీయించాలని, ప్రజాస్పందన కూడా తీసుకోవాలని కలెక్టర్ వివరించా రు. 21న జరగనున్న యోగాంధ్రలో ప్రజలతో పా టు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు భాగస్వా మ్యం కావాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికా రి డాక్టర్ ఎం.వినోద్కుమార్, డాక్టర్ టి.జగన్మోహనరావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్రరావు, డీపీఓ టి.కొండలరావు, మున్సిపల్ కమిషన ర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఏపీడీ ఎ.మురళీధ ర్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్.కృష్ణవేణి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి ఇ.అప్పన్న, జిల్లా మత్స్య శాఖాధికారి టి.సంతోష్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.