
● కమ్మవలసలో ఏనుగుల గుంపు
బొబ్బిలి రూరల్:
మండలంలోని కమ్మవలసలో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మంగళవారం రాత్రి ముత్తాయివలస నుంచి కమ్మవలసకు చేరుకున్న ఏనుగులు అక్కడే మామిడితోటల్లో తిష్టవేశాయి. దీంతో ఏరోజు ఏ గ్రామానికి చేరుకుని ఏ హాని తలపెడతాయోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపులో ఇటీవల జన్మించిన గున్న ఏనుగు, మరో రెండు చిన్నవి, ఆరు పెద్ద ఎనుగులు ఉన్నాయి. అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల జాడను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
భయాందోళనలో గ్రామస్తులు