
కొఠియా గ్రామాల్లో కొరాపుట్ కలెక్టర్ పర్యటన
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశాలోని కొరాపుట్ కలెక్టర్ కీర్తి వాసన్ పర్యటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కొఠియా, దొర్లతాడివలస, నేరెళ్లవలస, ధూళిభద్ర, ఎగువశెంబి, డోలియాంబ గ్రామాల్లో పర్యటించి ఆయాగ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ గ్రామాల్లో అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఒడిశా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 27న
కొఠియా, నేరెళ్లవలసల్లో జరగనున్న జగన్నాథ స్వామి రథయాత్ర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను కలెక్టర్ కీర్తి వాసన్ పర్యవేక్షించారు.