
పైడితల్లికి చండీయాగం
విజయనగరం టౌన్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి వేదపండితులు మంగళవారం చదురుగుడి ఆవరణలో శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. దూసి శివప్రసాద్ అమ్మవారికి యాగం చేసి, యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను భక్తులకు అందజేశారు. సుమారు 40 మంది దంపతులు యాగంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తరించారు.
పెళ్లి చేసుకుంటానని
నమ్మించి మోసం
● నిందితుడిపై కేసు నమోదు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస ప్రాంతంలో గల నాయుడువీధికి చెందిన రవితేజ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని నమ్మించి మోసం చేయడంతో పట్టణ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ కె.మురళీధర్ తెలిపిన వివరాల మేరకు బాధిత యువతి, నిందితుడు రవితేజ ఇద్దరు విశాఖలోని ఓ రియల్ఎస్టేట్ కార్యాలయంలో పనిచేసేవారు. ఒకే ప్రాంతానికి, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికండా వాడుకుని పెళ్లి విషయం వచ్చేసరికి కాదని చెప్పడంతో మోసపోయానని గుర్తించిన యువతి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బట్టల షాపులో అగ్నిప్రమాదం
చీపురుపల్లి: పట్టణంలోని మెయిన్రోడ్డులో గల రాధామాధవ ప్లాజాలో ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగిందని దుకాణం యజమాని చెబుతున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ దుర్ఘటనపై బాధితుడు కలివరపు జగదీష్ మాట్లాడుతూ సోమవారం రాత్రి ఎంతో విలువైన మెటీరియల్ తీసుకువచ్చి దుకాణంలో పెట్టామని, మొత్తం కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
క్వారీ లారీ బోల్తా
వేపాడ: మండలంలోని వావిలపాడు క్వారీ నుంచి విశాఖ వెళ్తున్న లారీ బోల్తా పడింది. వావిలపాడు నుంచి విశాఖ వైపు పెద్దపెద్ద బండరాళ్లను తీసుకెళ్తుతున్న లారీ ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పోలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్, జేసీబీల సహాయంతో లారీని తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: స్థానిక కోర్టు సముదాయంలో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎం.బబిత తెలిపారు. ఇదే విషయమై ఆమె జిల్లా కేంద్రంలో బ్యాంకులు, చిట్ఫండ్ కంపెనీల మేనేజర్లు, అధికారులతో మంగళవారం సమా వేశమై పలు సూచనలు చేశారు. వారి పరిధిలోని కేసులు రాజీ అయ్యేలా చూడాలని వారిని కోరారు. ప్రతి లోక్ అదాలత్లో పెద్దఎత్తున కేసుల పరిష్కారం జరుగుతోందని, ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ, కార్యదర్శి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పైడితల్లికి చండీయాగం

పైడితల్లికి చండీయాగం

పైడితల్లికి చండీయాగం