
విద్యార్థుల దాహం కేకలు..!
● పాఠశాలల్లో తాగేందుకు నీరు లేక అవస్థలు
పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమం పేరిట ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులకు 11 రకాల నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తే నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు తాగునీరు లేకుండా పోయింది. గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి ప్రతి పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ల ద్వారా మినరల్ వాటర్ను విద్యార్థులకు ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం వాటి నిర్వహణ సక్రమంగా లేక ప్రతి పాఠశాలలో మూలకు చేరి నిరుపయోగంగా దర్శనమిస్తూ విద్యార్థులకు దాహం తీర్చలేని దుస్థితిలో దర్శనమిస్తున్నాయి. మంచి ఆలోచనతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం అతి తక్కువ వ్యయంతో మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు తాగునీరు అందించే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు పాలకులు, అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల దాహం కేకలు..!

విద్యార్థుల దాహం కేకలు..!