యువకుడిపై బీర్‌ బాటిల్‌తో దాడి | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై బీర్‌ బాటిల్‌తో దాడి

Jun 18 2025 3:17 AM | Updated on Jun 18 2025 3:17 AM

యువకుడిపై బీర్‌ బాటిల్‌తో దాడి

యువకుడిపై బీర్‌ బాటిల్‌తో దాడి

వంగర: మండల పరిధి కొప్పరవలస సమీపంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై వంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొప్పరవలస–కొండచాకరాపల్లి ఐటీడీఏ కాలనీ సమీపంలో ఉన్న జీడితోటల వద్ద కొంతమంది యువకులు మంగళవారం మద్యం తాగుతున్నారు. అదే సమయంలో వీరఘట్టం నుంచి స్వగ్రామం ఐటీడీఏ కాలనీకి వెళ్లేందుకు అటువైపుగా బంటుపల్లి శంకరదొర వస్తున్నాడు. ఇంతలో అక్కడ మద్యం తాగుతున్న యువకులు శంకరదొరను కులంపేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శంకరదొర మెడభాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఈఎంటీ ఆలుబిల్లి జగదీష్‌ బాధితుడికి ప్రథమ చికిత్స అందించి రాజాం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి కారకులైన కొప్పరవలస గ్రామానికి చెందిన కోట్ల గణేష్‌, కోట్ల అప్పలరాజు, రేగిడి మండలం తోకలవలస గ్రామానికి చెందిన బుడితి రాంబాబులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వై.పైడితల్లి తెలిపారు.

మద్యం మత్తులో ఆకతాయిల వీరంగం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement