
సారా స్థావరాలపై దాడి
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూరింటెండెంట్ శ్రీనాథుడు ఆదేశాల మేరకు నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన కెరడ, సుళువ, వలవ గ్రామాల పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు 3500 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు చెప్పారు. దాడుల్లో జిల్లా ఏఈఎస్పీ జీవన్ కుమార్, కిశోర్, డీటీఎఫ్ సీఐ వీవీఎస్ శేఖర్ బాబు, సాలూరు, బొబ్బిలి, కురుపాం, రాయగడ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
● 6 మద్యం సీసాల పట్టివేత
గుర్ల: మండలంలోని సదానందపురంలో బెల్ట్ షాపు ద్వారా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఆరెస్ట్ చేసినట్లు నెల్లిమర్ల ఎకై ్సజ్ ఎస్సై ఎం. వెంకటరావు మంగళవారం తెలిపారు. మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి ఆరు మద్యం సీసాలు పట్టుకుని సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.