
కౌమార దశ పిల్లలకు సన్మార్గం చూపాలి
విజయనగరం ఫోర్ట్: కౌమారదశ పిల్లల్లో మానసిక, శారీరక ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని, తల్లిదండ్రులు, సంరక్షకులు వారితో మేమేకమై సన్మార్గం చూపాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి పిలుపునిచ్చారు. స్థానిక కన్వెన్షన్ సెంటర్లో సీడీపీఓలకు గురువారం నిర్వహించిన వర్క్షాపును ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ కిశోర బాలికల అలోచనలు ప్రమాదకర పరిస్థితుల నుంచి దూరం చేయాలన్నారు. బాల, బాలికలను డిజిటల్ మాధ్యమాలు ప్రభావితం చేస్తున్నాయని, కౌమారదశలో ఉన్న బాలబాలికలతో చర్చించి వారి అవసరాలు తీర్చాలని తెలిపారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, లేదంటే డిజిటల్ మాధ్యమాల ప్రభావంతో చెడుదారిన పడే ప్రమాదం ఉందన్నారు. గత 7, 8 సంవత్సరాలుగా జరుగుతున్న అధ్యయనాల్లో కౌమారదశలో ఉన్న పిల్లలు మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నట్టు తేలిందన్నారు. జిల్లాలో ఉన్న సఖి, యువ గ్రూప్ పరిధిలో కిశోర బాలబాలికలు, వారి తల్లిదండ్రులకు ఫోక్సో చట్టం గురించి వివరించాలని చెప్పారు. బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ నిరోధించాలన్నారు. సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లల్లో వివిధ వృత్తివిద్యాకోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రుక్సానా సుల్తానా బేగం, పార్వతీపురం మన్యం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గ, జిల్లా నోడల్ ఆఫీసర్ టి.జగన్, తదితరులు పాల్గొన్నారు.
సెల్ఫోన్లకు పిల్లలను దూరం చేయాలి
సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి