
జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ‘తోషిని’
తెర్లాం: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీల్లో తెర్లాం హైస్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థిని అడ్డా తోషిని ‘బోసి గేమ్’ వ్యక్తిగత హయ్యర్ ఎబిలిటీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకోడంతోపాటు, దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 21–23వరకు నూజివీడులోని అగిరిపల్లి హిల్ పారడైజ్ స్కూల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్స్ భారత్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెర్లాం హైస్కూల్ నుంచి రాష్ట్రస్థాయి బోసి గేమ్ పోటీలకు హాజరైన తోషిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. అలాగే జూలై నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికై ంది. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచిన ఆమె సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది. ఈ సందర్భంగా తోషినిని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, తెర్లాం హైస్కూల్ హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎస్కార్ట్ సునీల్ అభినందించారు.
బ్యాడ్మింటన్లో కాంస్యపతకం
దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 రాష్ట్రస్థాయి పోటీల్లో తెర్లాం హైస్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థి కొప్పర విజయకుమార్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్రస్థాయిలో తృతీయస్థానాన్ని సాధించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. విజయకుమార్కు రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ సంచాలకుడు శ్రీనివాసరావు పతకాన్ని అందజేసి అభినందించారు.
రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని

జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ‘తోషిని’