డీఐజీ ఆధ్వర్యంలో నాకాబందీ | - | Sakshi
Sakshi News home page

డీఐజీ ఆధ్వర్యంలో నాకాబందీ

Apr 19 2025 9:36 AM | Updated on Apr 19 2025 9:36 AM

డీఐజీ

డీఐజీ ఆధ్వర్యంలో నాకాబందీ

విజయనగరంలో రెండు గంటల పాటు పోలీసుల తనిఖీలు

20 కిలోల వెండి, 50 వాహనాలు సీజ్‌

విజయనగరం క్రైమ్‌: నాకాబందీ, కార్డన్‌సెర్చ్‌లు వంటి స్పెషల్‌ ఆపరేషన్లతో పోలీసులు జిల్లాలో తాము ముందుగా నిర్దేశించిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో విజయనగరంలో గురువారం రాత్రి విశా ఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి ఆధ్వర్యంలో ఎస్పీ వ కుల్‌ జిందల్‌ స్వీయ పర్యవేక్షణలో ఆకస్మిక త నిఖీలు చేశారు. రాత్రి రెండు గంటల పాటు విస్తృతంగా విజయనగరాన్ని మొత్తం పోలీసులు జల్లెడ పట్టారు. నగరంలోని వై జంక్షన్‌, వీటీఅగ్రహారం, మయూరీ జంక్షన్‌, రైల్వే స్టేషన్‌, ఎత్తుబ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ, కంటోన్మెంట్‌, కలెక్టరేట్‌, ఉడాకాలనీ, కామాక్షినగర్‌, గంటస్తంభం, గూడ్స్‌ షెడ్‌, కన్యకాపరమేశ్వరి టెంపుల్‌, మూడు లాంతర్లు, నీళ్ల ట్యాంక్‌, దాసన్నపేట, కోట జంక్షన్‌లో ముగ్గురు డీఎస్పీలు,14 మంది సీఐలు, 44 మంది ఎస్సైలు 276 మంది కానిస్టేబుల్స్‌తో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్‌ జిందల్‌ మాట్లాడుతూ ఈ ఆకస్మిక తనిఖీలో 51 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. అలాగే 4,437వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని చెప్పారు. ప్రధానంగా వన్‌ టౌన్‌స్టేషన్‌ పరిధిలో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 20 కిలోల వెండిని పట్టుకున్నామని తెలిపారు. అలాగే ఒక ఇసుక లారీ, 8 మద్యం బాటిల్స్‌ సీజ్‌ చేశామని చెప్పారు. మద్యం తాగిన వారిపై వంద కేసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం కలెక్టరేట్‌ జంక్షన్‌ వద్ద విజయనగం టౌన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, బొబ్బిలిలో డీఎస్పీ భవ్యా రెడ్డి, చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద డీఎస్పీ రాఘవులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారని ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఈ సందర్భంగా తెలియజేశారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలను

అరికట్టేందుకు నాకాబందీ

పార్వతీపురం రూరల్‌: చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహనాల తనిఖీ స్పెషల్‌ డ్రైవ్‌ (నాకాబందీ) చేపట్టినట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలో ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఆయా స్టేషన్ల ఎసైలు వారి పరిధిలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధానంగా చెక్‌పోస్టుల వద్ద, ప్రధాన కూడలివద్ద స్టాపర్లు ఏర్పాటు చేసి గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమరవాణా, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అధిక లోడ్‌ ఉన్న వాహనాలు, రికార్డుల పరిశీలన, పెండింగ్‌ చలానాలు తదితర చట్ట వ్యతిరేక కార్యక్రమాల కట్టడికి ఈ ఆకస్మిక తనిఖీలు ఒకేరోజు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ అధికారులు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ శివారు ప్రాంతాలైన వెంకంపేట గోరీలు, ఎస్‌వీడీ కళాశాల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో స్వయంగా పాల్గొని వచ్చిపోయే వాహనాలను ఆపి సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

డీఐజీ ఆధ్వర్యంలో నాకాబందీ1
1/1

డీఐజీ ఆధ్వర్యంలో నాకాబందీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement