న్యూస్రీల్
పల్నాడు
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
తాడికొండ: తుళ్లూరు మండలంలోని వేంకటపాలెంలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డాక్టర్ ఎ.శరత్ సోమవారం పరిశీలించారు.
సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు గత నెల పురిటి నొప్పులతో మూడో ప్రసవానికి ఓ గర్భిణి వచ్చింది. తీవ్ర ఎనీమియాతో బాధపడుతుండటంతో ప్రసవ సమయంలో ఇబ్బందులు తప్పలేదు. గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బిడ్డకు జన్మనిచ్చి ఆమె మరణించింది. వైద్యులు ఆరా తీయగా, ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమేనని, 14వ ఏటే తొలి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు. బాల్యవివాహం, టీనేజ్ ప్రెగ్నెన్సీతో పుట్టిన ఇద్దరు చిన్నారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూడో కాన్పులో తల్లి మరణించడంతో ముగ్గురు బిడ్డలు అనాథలయ్యారు. ఇటు ప్రభుత్వం, అటు అధికారులు టీనేజ్ ప్రెగ్నెన్సీని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.


