
రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి
నరసరావుపేట: జిల్లాలో ఆయుష్మాన్భవ, రాష్ట్ర వైద్యఆరోగ కుటుంబ సంక్షేమశాఖల కింద పనిచేస్తున్న తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తమ డిమాండ్ల సాధనకోసం పట్టణంలోని స్టేషన్రోడ్డులో గల గాంధీపార్కు ఎదుట ఏపీ మిఢ్లెవెల్ హెల్తె ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఎ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎం.అనుపమ, ఉపాధ్యక్షుడు కె.వినోధ్, జిల్లా కో–ఆర్డినేటర్ బి.సాగర్, ప్రధాన కార్యదర్శి రాము మాట్లాడుతూ జిల్లాలో తాము 361మంది పనిచేస్తున్నామన్నారు. తామందరమూ ఆరేళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్నామని, నిబంధనల ప్రకారం తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సిఫార్సుకూడా చేసిందన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకొని తమతో పాటు పనిచేసే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23శాతం వేతన సవరణ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దెబకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని, నిర్ధిష్టమైన జాబ్చార్టు అందజేయాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలుచేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ సెక్రటరీ శివానాయక్, కె.శివ, కోటి, పెద్దసంఖ్యలో సీహెచ్ఓలు పాల్గొన్నారు.
నరసరావుపేటలో సీహెచ్ఓల ధర్నా