
రథం నిర్మాణానికి రూ. ఒకలక్ష విరాళం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా నందపూర్ జగన్నాథ రథం నిర్మాణానికి జయపూర్ మహారాజు చంద్ర చుడ్ విశ్వేశ్వర్ దేవ్ రూ. లక్ష విరాళం అందజేశారు. బుధవారం నందపూర్ జగన్నాథ మందిర నిర్వాహణ కమిటీ పెద్దలకు జయపూర్ రాజ కోట వద్ద రాజ పరివార సిబ్బంది విరాళం మొత్తాన్ని అందించారు. నందపూర్ రాజధానిగా చేసుకొని సూర్య వంశీయులు పరిపాలన చేశారు. అనంతరం వీరు జయపూర్ని రాజధానిగా మార్చుకున్నారు. నాడు సూర్య వంశీయులు నందపూర్లో స్థాపించిన 17 దేవ దేవి పీఠాలను నేటికీ అక్కడ ప్రజలు కొలుస్తున్నారు. నందపూర్ కమిటీ సభ్యులు జగన్నాథ పంగి, భువనేశ్వర్ దళపతి, బుడు పూజారిలు జయపూర్ రాజమహాల్కి తరలి వచ్చారు. వీరికి రాజ మహాల్ మేనేజర్ కిషన్ కుమార్ నగదు అందజేశారు. రథాయాత్ర రోజున రథం మీద ఉండే ముగ్గురు దేవతా మూర్తులకు ఇచ్చే రాజ విందుకి రాజ ప్రతినిధి హాజరవుతారని రాజ ప్రసాదం సందేశం ఇచ్చింది.