గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్‌కి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్‌కి ఫిర్యాదు

Jun 26 2025 6:15 AM | Updated on Jun 26 2025 6:31 AM

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లాలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్‌కి బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల ఉద్యమ నేత ప్రపుల్ల సామంత్రాయ్‌ నేతృత్వంలో ఉద్యమకారులు రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌ కంభంపాటి హరిబాబుకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని జొరిగాం సమితి హత్తిబెడ, రాయిఘర్‌ సమితి నకిటిసిమెద గ్రామాలలో గిరిజనుల నివాసాలను అధికారులు కూల్చి వేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు రేగాయి. నబరంగ్‌పూర్‌ డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠితో కలసి ప్రపుల సామంత్రాయ్‌ బాధిత ప్రాంతాలను సందర్శించారు. ఎటువంటి నోటీసులు లేకుండా అటవీ ప్రాంతాలో గిరిజనుల ఇళ్లను కూల్చి వేశారని గవర్నర్‌కు వివరించారు. ప్రపుల్ల వెంట సర్వదల్‌కి చెందిన విశ్వజిత్‌ రాయ్‌, మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమ నేత లింగరాజ్‌ అజాద్‌లు ఉన్నారు.

ఉద్యమానికి రెవెన్యూ

ఉద్యోగులు సిద్ధం

జూలై 7న నల్లబ్యాడ్జీలతో విధులకు..

14 నుంచి సమ్మెలోకి..

కొరాపుట్‌: సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతామని రెవెన్యూ మినిస్ట్రీయల్‌ ఉద్యోగులు వెల్లడించారు. ఈ విషయాన్ని నబరంగ్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శుభంకర్‌ మహాపాత్రోకు బుధవారం నోటీసును అందజేశారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, బీమా రూ. 20 లక్షలు వర్తింపజేయాలని, ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో అర్హత ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని, ఖాళీలు భీర్తీ చేయాలని, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జూలై ఏడో తేదీ నుంచి నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరవుతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి బాలాజీ సాహు, జిల్లా అధ్యక్షుడు అశుతోష్‌ మహంతి, మితాలి పట్నాయక్‌, కై లాష్‌ చంద్ర దాష్‌ ఉన్నారు.

పర్లాకిమిడిలో ఆక్రమణల తొలగింపు

పర్లాకిమిడి: జగన్నాథ రథాయాత్రకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా రథాయాత్ర జరుగనున్న పర్లాకిమిడి పట్టణంలోని రాజవీధి, గుండిచామందిరం, కాలేజ్‌ రోడ్డు, మార్కెట్‌ వద్ద ప్రభుత్వ భూమిని ఆక్రమించి, డ్రైనేజీలను వదలకుండా ఆక్రమించిన చిల్లర దుకాణాలు, తోపుడు బండ్లు దుకాణాలను అధికారులు బుధవారం తొలగించారు. హైస్కూల్‌ జంక్షన్‌ వద్ద పకోడి, చిరు దుకాణాలను తొలిగించారు. మరోసారి దుకాణాలను రోడ్లపై పెట్టే వారిపై జరిమానా విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా హెచ్చరించారు. మార్కెట్‌కు ఇరువైపులా ఉన్న వాహనాలను కూడా తొలగించారు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి మాధవానంద నాయక్‌, తహసీల్దార్‌ నారాయణ బెహారా, పురపాలక సంఘం ఈవో లక్ష్మణ ముర్ము, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్‌కి ఫిర్యాదు 1
1/2

గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్‌కి ఫిర్యాదు

గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్‌కి ఫిర్యాదు 2
2/2

గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై గవర్నర్‌కి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement