సీఎం నివాసం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

సీఎం నివాసం ముట్టడి

Jun 26 2025 6:14 AM | Updated on Jun 26 2025 6:15 AM

భువనేశ్వర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ అధికారిక నివాసాన్ని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు బుధవారం చుట్టుముట్టారు. దళితులపై అమానుష దాడులు, మహిళలపై పెరుగుతున్న దారుణాలు, శాంతిభద్రతల పరిస్థితులపై రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రంజిత్‌ పాత్రో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాజ్‌ మహల్‌ చక్‌ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. ఈ పరిస్థితుల్లో పోలీసులతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలందరినీ వ్యాన్‌నుల్లో తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement