రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం

Jun 26 2025 6:14 AM | Updated on Jun 26 2025 6:14 AM

రథయాత

రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం

భువనేశ్వర్‌: రథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్‌, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్‌, కార్డన్‌ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్‌, జిల్లా న్యాయాధికారులు, సీనియర్‌ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం1
1/1

రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement