
అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ధ్వజం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వివిధ సమితులు, పంచాయతీలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందజేస్తున్న నిధులు గ్రామ సభలు, పంచాయతీ ప్రతినిధుల ప్రామేయం లేకుండానే అధికారులు ఆమోదం తెలుపుతున్నారని గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, మోహనా జెడ్పీటీసీ సభ్యుడు సునీల్ కుమార్ బిషోయి, రాయఘడ సమితి అధ్యక్షురాలు పూర్ణబాసి నాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 53వ జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షత వహించారు. జిల్లా పరిషత చైర్మన్ గవర తిరుపతి రావు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ సి.డి.ఎం శంకర్ కెరకెటా, ఆదనపు పీడీ పృథ్వీరాజ్ మండల్ తదితరులు హాజరయ్యారు. గత జిల్లా పరిషత్ సమావేవాన్ని సమితి చైర్మన్లు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు బహిష్కరించారు. ఈసారి ఏడు సమితుల బ్లాక్ చైర్మన్లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. పలు ప్రభుత్వ పథకాలైన కేంద్ర ఆయుష్మాన్ భారత్, వికసిత్ భారత్, వికసిత్ ఒడిశా పథకాలకు మండలాలకు ఎంతెంత నిధులు వె వెచ్చిస్తున్నారో తెలియజేయడం లేదని పలువురు సమితి అధ్యక్షులు ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశానకి జెడ్పీటీసీలకు కనీసం ఆహ్వానం కూడా అందలేదని మోహనా నుంచి వచ్చిన జిల్లా పరిషత్ సభ్యులు ఆరోపించారు. జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సమితి చైర్మన్లు కోరారు.