
మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
రాయగడ: గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక సమితి కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సమితి సభ్యులు, సర్పంచులు తమ పరిధిలో గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగు, సాగునీరుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సమితి చైర్మన్ టున్ని హుయిక, వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రక, సమితి సభ్యులు, సర్పంచ్లు, ఏబీడీఓ కాళి చరణ్ మాఝి తదితరులు పాల్గొన్నారు.