భువనేశ్వర్: సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన అవసరమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. రాజ్ భవన్ నూతన అభిషేక్ హాల్లో సైబర్ భద్రత – మాదక ద్రవ్యాల వ్యసన నివారణపై ప్రజా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రసంగించారు. ఆయనతో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా, క్రైమ్ బ్రాంచ్ సీఐడీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ రితేష్ మహాపాత్రో ఈ అంశాలపై వివిధ రకాల వివరణాత్మక విషయాలు వివరించారు. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న నేరాలు ఆందోళనకరంగా మారాయన్నారు. అలాగే మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి కోలుకోవడానికి సమయం, ధైర్యం మరియు సరైన మద్దతు అవసరమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.బి.ఎస్.రాజ్పుట్, స్పెషల్ టాస్క్ఫోర్స్ డీఐజీ పినాక్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ హరిబాబు కంభంపాటి
సైబర్ భద్రతపై అవగాహన అవసరం