ముగిసిన పీఈసీటీఈఏ సదస్సు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పీఈసీటీఈఏ సదస్సు

Jun 25 2025 7:06 AM | Updated on Jun 25 2025 7:06 AM

ముగిసిన పీఈసీటీఈఏ సదస్సు

ముగిసిన పీఈసీటీఈఏ సదస్సు

భువనేశ్వర్‌: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ నిర్వహించిన ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ కన్వర్టర్స్‌ ఫర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఎనర్జీ అప్లికేషన్స్‌–2025 (పీఈసీటీఈఏ–2025) సదస్సు విజయవంతంగా ముగిసింది. రవాణా మరియు ఇంధన వ్యవస్థల్లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ భవిష్యత్తుపై విద్యావేత్తలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో చర్చించారు. ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుకుమార్‌ మిశ్రా సదస్సును ప్రారంభించారు. స్థానిక ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శ్రీపాద కర్మల్కర్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ మరియు రవాణా రంగాల్లో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ కేంద్రంగా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే నిమగ్నం చేయడం మరియు ఇంజినీరింగ్‌ యొక్క సామాజిక విలువకు వారిని బహిర్గతం చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ 2027లో ఈ సదస్సును ద్వైవార్షిక కార్యక్రమంగా మార్చడానికి జాతీయ స్థాయి స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement