
సారాపై ఉక్కు పాదం మోపండి
● సీఎంకు లక్ష్మీపూర్ ఎమ్మెల్యే వినతి
కొరాపుట్: సారా తయారీపై ఉక్కు పాదం మోపాల ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ జిల్లా లక్ష్మీపూ ర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత విజ్ఞప్తి చేశారు. సోమవా రం రాజధాని భువనేశ్వర్లో ముఖ్యమంత్రి మొహ న్ చరణ్ మజ్జికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎంతో సమావేశమైన స్థానిక పరిస్ధితులు వివరించారు. నాణ్యతలేని పదార్థాలతో సారా తయారు చేసి వ్యాపారులు విక్రయిస్తున్నారన్నారు. దీనివలన వేలాది మంది గిరిజనులు అనారోగ్యంతో మరణిస్తున్నారన్నారు. గ్రామాల్లో మద్యం ఏరు లె పారుతుందన్నారు. గిరిజన మహిళల ఫిర్యాదులతో తానే స్వయంగా మద్యం తయారీ కేంద్రాలను పరిశీలించానన్నారు. పురుగులు పట్టిన పదార్థాలతో సారా తయారు చేస్తున్నారన్నారు. తనతో కలిసి వేలాది మంది గిరిజనులు మద్యంపై పోరాటాలు చేశారన్నారు. సుమారు 400 మందికి పైగా గిరిజనులపై అక్రమ కేసులు పెట్టారని ఆధారాలు చూపించారు. ఇటువంటి ప్రజా పోరాటాలు చేసే వారిపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర ఎకై ్సజ్ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ముఖ్యమంత్రి సలహాదారుడు ప్రకాష్ మిశ్రలతో భేటీ అయి పరిస్థితిని వివరించారు.

సారాపై ఉక్కు పాదం మోపండి