
వినతుల స్వీకరణ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలో జిల్లా కలెక్టర్లు ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్ పట్టణంలోని సమితి కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఇందులో 48 ఫిర్యాదుల రాగా.. వాటిలో 40 వ్యక్తిగత, 8 సామాజిక ఫిర్యాదులు ఉన్నాయి. 22 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఎస్పీ సందీప్ సంపత్ పాల్గొన్నా రు. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్లో కలెక్టర్ వి.కీర్తి వాసన్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఎస్హెచ్జీ గ్రూపులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎస్పీ రోహిత్ వర్మ పాల్గొన్నారు.

వినతుల స్వీకరణ