
ప్రజా భాగస్వామ్యం ప్రధానం
మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025
సంక్షేమ కార్యక్రమాల్లో..
హత్యకి దారి తీసిన అక్రమ సంబంధం
భువనేశ్వర్: ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆశయం నెరవేరి సాధికార సమాజం వెలుగులోకి వస్తుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రసంగించారు. ప్రభుత్వ మద్దతుతో నడిచే సామాజిక సంక్షేమ పథకాల్లో పౌరుల నమోదు తక్కువగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్ భవన్ అధికారులు, సిబ్బందిని నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ను గవర్నరు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉదాహరణగా నిలిచి ప్రజలకు అవగాహన కల్పించడంలో ఉదాహరణగా ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రోత్సహించారు. రాజ్ భవన్ ప్రాంగణం నూతన అభిషేక్ హాల్లో సామాజిక భద్రతా పథకాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత ప్రభుత్వం అనేక ప్రజా కేంద్రీకృత సంక్షేమ పథకాలను ప్రారంభించిందన్నారు. ఈ పథకాలలో చాలా వరకు పేదలు, దుర్భలులు, అణగారిన వర్గాలకు ఆర్థిక రక్షణ, సంక్షేమ ప్రయోజనాలను విస్తరించడం లక్ష్యంగా పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అర్హత ఉన్న వారిలో ఎక్కువ మంది అవగాహన లేకపోవడం వల్ల ప్రయోజనాలను పొందడం లేదు. విద్యావంతులు, ఉన్నత వర్గాలలో కూడా, పథకాల గురించి అవగాహన ఉన్నప్పటికీ చాలా మంది నమోదు చేసుకోవడం లేదన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి అనేక ప్రధాన పథకాలను గవర్నర్ సూచించారు. ప్రజలు తమ ఆర్థిక భద్రత మరియు శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కల్పించడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రచార కార్యక్రమాల ప్రాముఖ్యతను తెలియజేశారు. భారతీయ స్టేట్ బ్యాంకు రాజ్ భవన్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ సునీతా బెహరా ఈ కార్యక్రమంలో వివిధ పథకాల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ 101 మంది రాజ్ భవన్ సిబ్బంది సభ్యుల దరఖాస్తు ఫారాలను సంబంధిత పథకాలలో నమోదు కోసం భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్కు అందజేశారు. రాష్ట్ర క్రైమ్ శాఖ పోలీసు డైరెక్టర్ జనరల్ వినయ్తోష్ మిశ్రా, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. బి. ఎస్ రాజ్పుట్, ప్రత్యేక టాస్క్ఫోర్సు డీఐజీ పినాక్ మిశ్రా, రాజ్ భవన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూస్రీల్
గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి

ప్రజా భాగస్వామ్యం ప్రధానం

ప్రజా భాగస్వామ్యం ప్రధానం

ప్రజా భాగస్వామ్యం ప్రధానం