
మిస్ పాపులర్గా తెలుగమ్మాయికి అవార్డు
కొరాపుట్: మిస్ ఒడిశా ఇండియా–2025 పోటీల్లో మిస్ పాపులర్గా తెలుగమ్మాయికి ప్రథమ స్థానం వచ్చింది. సోమవారం భువనేశ్వర్ లైఫ్ ప్రైవేట్ హోటల్ మిస్ ఒడిశా ఇండియా 2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందాల అమ్మాయిలు పాల్గొన్నారు. ఇందులో కోరాడ సుప్రియకు మిస్ పాపులర్ విభాగంలో ప్రథమ స్థానం వచ్చింది. సుప్రియ స్వస్థలం కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి కేంద్రం. సుప్రియ తండ్రి కోరాడ సురేష్ది బొరిగుమ్మ. ఇక్కడే వ్యాపారం చేసేవారు. వ్యాపారరీత్యా భువనేశ్వర్లో స్థిరపడ్డారు. సుప్రియ ప్రస్తుతం పీజీ చదువుతోంది.