
ఒకనాడు దాత.. నేడు దయనీయ గాథ
రూ.46 వేలు మందులకు ఖర్చవుతాయి. విశాఖ పట్నంలోని టాటా మెమోరియల్ ఆస్పత్రి నుంచి మందులు తెచ్చుకొని జీవనం కొనసాగిస్తున్నారు.
ప్రాణం పోసిన బీఎస్కేవై కార్డు..
గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రవేశ పెట్టిన బిజూ స్వస్థ్య కల్యాణ యోజన (బీఎస్కేవై) ఆరోగ్య బీమా కార్డు వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందింది. ఈ కార్డు తో ప్రతి నెల మందులు తెచ్చుకునేవారు. మిగతా సమస్యలు ఎలా ఉన్న మందుల ఖర్చులు లేకపోవడంతో రమేష్ ఆరోగ్య పరిస్థితి కుదుట పడింది.
ఊపిరితీస్తున్న ఆయుష్మాన్ కార్డు
రాష్ట్రంలో బీజేడి ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభు త్వం వచ్చింది. వెంటనే ప్రభుత్వం బీఎస్కేవై రద్దు చేసి దాని స్థానంలో ఆయుష్మాన్ కార్డు ప్రవేశ పెట్టింది. కొత్త కార్డుతో రమేష్ కుటుంబం మందులకు వె ళ్లగా ఆయుష్మాన్ కార్డులో మందులు ఇవ్వడం కుదరదని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దాంతో ప్రతి నెల రు.46 వేలు ఎలా మందులకు తేవాలో తెలియ క ఆ కుటుంబం తీవ్ర వేదన లో మునిగిపోయింది.
తరలివెళ్లిన రబినందో..
రమేష్ కుటుంబం దీనావస్థను బీజేడీకి చెందిన మాజీ మంత్రి రబినందో తెలుసుకున్నారు. వెంటనే పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని ప రామర్శించారు. తక్షణ సాయం కింద ఒక నెల మందుల ఖర్చులు రూ.46 వేలు ప్రకటించారు. రబినందో వెంట జయపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సు నీత, ఇతర బీజేడీ నాయకులు ఉన్నారు. అనంతరం రబినందో మాట్లాడుతూ రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
కొరాపుట్: నాడు వందలాది కుటుంబాలకు ఇంటి స్థలాలు దానమిచ్చిన కుటుంబానికి ఆయుష్మాన్ కార్డు శాపంలా మారింది. గొప్పగా బతికిన కుటుంబం ఇప్పుడు హృదయ విదాకర స్థితిలోకి వచ్చేసింది. జయపూర్కి చెందిన ముగడ సూర్యనారాయణ దానకర్ణుడుగా పేరు గడించారు. తనకున్న ఆస్తుల్లో అత్యధికం పేదలకు పంచి పెట్టారు. ఇల్లు లేని వారి కి ఉచితంగా ఇంటి స్థలాలు ఇచ్చారు. పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి మరీ వారికి దానం చేశారు. జాతీయ మీడియాలో సైతం ఆయన ఘనతలు ప్రచురితమయ్యాయి.
నేడు అగమ్యగోచరం..
పట్టణంలో ప్రసాదరావు పేట 4వ లైన్ లో నివసిస్తున్న సూర్యనారాయణ కుమారుడు ముగడ రమే ష్కి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకింది. వైద్యం కోసం ఉన్న ఆస్తులు పోయి చివరకు రమేష్ కుటుంబం అద్దె ఇంటిలోకి మారింది. రోగ తీవ్రత దృష్ట్యా అతడు మందులతోనే జీవించాలి. ప్రతి నెలా
– శాపంలా మారిన ఆయుష్మాన్ కార్డు
– చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు

ఒకనాడు దాత.. నేడు దయనీయ గాథ