
తెగిన హిరాఖండ్ బోగీలు
● ప్రయాణికులు సురక్షితం
● విడిపోయిన బోగీల్లో ఈస్ట్ కోస్ట్ జీఎం
కొరాపుట్: జగదల్పూర్–భువనేశ్వర్ మద్య నడిచే హిరాఖండ్ రైలుకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం 6.30 సమయంలో రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి. కొరాపుట్ జిల్లా కొట్పాడ్ నుంచి సమీప చత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్ పూర్ల మధ్య అమ్మాగుడ వద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి మిగతా బోగీలు విడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. మరో వైపు విడిపోయిన ఇంజిన్ వెనుక ఉన్న ప్రధాన వీఐపీ బోగీలో ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంకువాల్ ఉన్నట్లు సమాచారం. రైల్వే శాఖలో జీఎం స్థాయి అత్యున్నత వ్యక్తి ఉన్న బోగి ఇలా రైలు ఇంజిన్ నుంచి విడిపోవడం చర్చకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకొని జగదల్ పూర్ నుంచి రైల్వే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని బోగీలు కలిపారు. అయితే రెండోసారి కూడా బోగీలు విడిపోయాయని ప్రయాణికులు పేర్కొన్నారు. సుమారు 3 గంటల ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు హిరాఖండ్ రైలు జయపూర్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా ఆందోళన చెందారు.
రెండు వర్గాల మధ్య గొడవ
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి కోత్తమటేర్ గ్రామంలో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఏడుగురు గాయాలపాలయ్యారు. వీరికి మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం కోత్తమటేర్ గ్రామానికి కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, ఎస్పీ వినోద్ పటేల్ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.
జయపూర్లో భారీ వర్షం
కొరాపుట్: జయపూర్, నబరంగ్పూర్ పట్టణాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. మురుగు కాలువలు పొంగి రోడ్డు మీదకు ప్రవహించాయి. జయపూర్ మెయిన్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నబరంగ్పూర్ జిల్లా కేంద్రం తడిసి ముద్దయింది.
వరద నీటిలో
యువకుడు గల్లంతు
భువనేశ్వర్: బాలాసోర్ ప్రాంతంలో వరద ఉద్ధతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో సువర్ణ రేఖ నది నీటి మట్టం ప్రమాద సంకేతం దాటి కట్టలు తెంచుకుని రహదారులపై పొంగి పొరలుతుంది. ఈ పరిస్థితుల్లో వరద నీటిలో ప్రమాదవశాతు పడిన యువకుడు గల్లంతు అయ్యాడు. బలియాపాల్ ఇకిడిపాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రకటించారు. ఒడ్రాఫ్ బృందం గాలింపు చర్యలు కొనసాగిస్తుంది.
30 నుంచి మెట్రిక్
సప్లిమెంటరీ పరీక్షలు
భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్ఈ) ఆధ్వర్యంలో ఒడిశా మెట్రిక్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల పదో తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ bsoedirhaac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని బీఎస్ఈ ప్రకటించింది.

తెగిన హిరాఖండ్ బోగీలు

తెగిన హిరాఖండ్ బోగీలు

తెగిన హిరాఖండ్ బోగీలు

తెగిన హిరాఖండ్ బోగీలు