
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: భారతీయ స్టేట్ బ్యాంక్ జయపురం ప్రధాన శాఖ కార్యాలయంలో ఆదివారం బ్యాంక్ యాజమాన్యం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ ఎస్.ఎస్.మిశ్ర పర్యవేక్షణలో జయపురం జిల్లా కేంద్ర రక్తనిధి టెక్నీషియన్లు అభయ చరణ పండా, గురు పొరజ, బి.ప్రతిభ పాత్రో, నతాయిల్ దేవీ తదితరులు 65 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 21 ఏళ్ల ఇతిశ్రీ రథ్ మొదటిసారి రక్తదానం చేసి అందరితో ప్రశంసలు అందుకుంది. ఎమ్మెల్యే బాహిణీపతి, స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ సుభాష్ చంద్ర బెహరా, తదితరులు యువతిని సన్మానించారు. జయపురం సబ్డివిజన్ రక్త దాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, ఎస్బీఐ పట్టణ బ్రాంచ్ మేనేజర్ హిరణ్మయ కుమార్ పాడీ, డాక్టర్ జగదీష్ చంద్ర శెట్టి, తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం.. ప్రాణదానం