● సందడే సందడి | - | Sakshi
Sakshi News home page

● సందడే సందడి

Jun 23 2025 6:53 AM | Updated on Jun 23 2025 6:53 AM

● సందడే సందడి

● సందడే సందడి

పర్లాకిమిడి: పవిత్ర మహేంద్రగిరి పర్వతంలో భీమ, కుంతి, యుధిస్టర, పరఽశురామ్‌ కుండ్‌ను చూడటానికి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా నుంచి పర్యాటకులు అధికంగా విచ్చేశారు. పర్లాకిమిడి నుంచి రాయఘడ బ్లాక్‌ కోయిపూర్‌ వరకు ఒడిశా బస్సులు వేశారు. మహేంద్రగిరిపై వరకు తారురోడ్డు వేయడంతో కార్లు, వాహనాలు పర్లాకిమిడి నుంచి గంటన్నరలో ఇక్కడికి చేరుకోవచ్చు. మహేంద్రగిరి పర్వతం వద్ద ఒకరోజు విడిది ఉండటానికి జిల్లా అటవీశాఖ కాటేజ్‌లు ఏర్పాటుచేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అధికంగా వస్తున్నారు. దీంతో టోల్‌ గేటు వద్ద ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. మహేంద్రగిరిలో పబ్లిక్‌ పార్టిపేషన్‌తో హోటళ్లు నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల పర్లాకిమిడి విచ్చేసిన రాష్ట్ర ఎకై ్సజ్‌, ప్రజాపన్నుల శాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌కు పలువురు సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పర్వతాలు, తాగునీరు, షెల్టర్‌ ఏర్పాటుచేయడంతో శని, ఆదివారాల్లో గంజాం, భువనేశ్వర్‌, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి పర్యాటకలు విచ్చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement