
రథాలకు తుదిమెరుగులు
పర్లాకిమిడి: గుండిచా రథయాత్ర సమీపిస్తుండటంతో పర్లాకిమిడిలో జగన్నాథ, బలరామ, సుభద్ర రథాల పనులు పూర్తయ్యాయి. రాజవీధి జగన్నాథ రథాల వద్ద అందమైన ముగ్గులను చిత్రకారులు వేస్తున్నారు. రథాలకు బుద్దుడు, గోల్లభామలు, అనేక దేవతామూర్తుల బోమ్మలను అమర్చుతూ తుదిమెరుగులు చేపడుతున్నారు. వచ్చే బుధవారం అమావాస్య రోజు మూడు రథాలపై నీలచక్రాలు అమర్చుతారు. తదనంతరం విధియ రోజు జగన్నాధుడుని చీకటి గది నుంచి బయటకు తెచ్చి నేత్రోత్సవం జరుపుతారు. మరో వైపు రోడ్లు– భవనాల శాఖ ఆధ్వర్యంలో గుండిచా మందిరానికి మరమ్మతులు చేపడుతున్నారు.