
జగన్నాథ మందిరంలో మిఠాయిల తయారీ
కొరాపుట్: దక్షిణ ఒడిశా పూరీ దివ్య క్షేత్రంగా పిలవబడుతున్న కొరాపుట్ శబరి శ్రీ క్షేత్రానికికి పూరీ దివ్యాధాం నుంచి పాక శాస్త్ర ప్రవీణులు తరలి వచ్చారు. ఆదివారం పాక శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నవారు మిఠాయి తయారీలో నిమగ్నమయ్యారు. రథా యాత్ర సమయంలో కొరాపుట్ శబరి శ్రీ క్షేత్రంలోని మిఠాయి వంటకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని అనేక దేవాలయాలకు ప్రజలు తీసుకొని వెళ్తారు. ఈ నేపథ్యంలో కొరాపుట్ జగన్నాథ ఆలయ కమిటీ పూరీ నుండి ప్రత్యేక మిఠాయి వంటవాళ్లని పిలిపించింది. వారు ఈ యాత్ర సమయంలో స్థానిక కొరాపుట్ జగన్నాథ దేవావయ వంటవాళ్లకి దీనిపై శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాక దేవదేవుళ్లకి ఇష్టమైన వంటలు తయారు చేయనున్నారు. వీరు ఆరు రకాల ఖాజాలు, బాలుసా తయారీలో నిపుణులని కమిటీ పేర్కొంది. ఇప్పటికే శబరి శ్రీ క్షేత్ర జగన్నాథ దేవాలయంలో అధునాతన పరిజ్ఞాన వస్తువులు ఉన్న వంట శాల ఉంది. నిత్యం వందలాది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు చేస్తుంటారు. రథాయాత్ర సమయంలో ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది.