
రోగుల అవస్థలు
పర్లాకిమిడి: స్థానిక ప్రభుత్వ హడ్క్వార్టర్ ఆసుపత్రిలో అన్ని వార్డుల్లోనూ వారంరోజుల నుంచి ఏసీలు పనిచేయక పోవడంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజూ 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో రోగులు అవస్థలు పడుతున్నారు. దీనిపై జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ ఎం.ఎం.ఆలీకి జిల్లా ట్రాన్స్జెండర్స్ సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా కార్యదర్శి జాస్మిన్ షేక్ ఆదివారం ఫిర్యాదు చేశారు. వెంటనే ఏసీలు బాగుచేయాలని కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయని ఏసీలు