
శ్రీమందిరంలో రాజప్రసాద్ విజే
భువనేశ్వర్: పవిత్ర ఒణొసొరొ 12వ రోజు పురస్కరించుకుని ఆషాఢ కృష్ణ పక్షం ద్వాదశి తిథి ఆదివారం శ్రీ మందిరంలో రాజప్రసాద్ విజే నిర్వహించారు. దేవతల స్వస్థత సమాచారం పూరీ గజపతి మహారాజాకు గోప్య సేవకులు తెలియజేయడం రాజప్రసాద్ విజే సమగ్ర సారాంశం. ఈ సందర్భంగా మూల విరాట్ల శ్రీఅంగాల నుంచి తొలగించిన పదార్థాలను గజపతి మహా రాజాకు సమర్పించారు.
కరాల కర్మ
స్నాన యాత్ర మర్నాటి నుంచి శ్రీమందిరంలో మూల విరాటులు స్వస్థతతో కోలుకునేందుకు గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సందర్భంగా సాధారణ పూజాదులు, నైవేద్యాలు నివారించి ఆయుర్వేద వైద్య విధానాలతో చికిత్స, పత్యం పదార్థాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆషాఢ కృష్ణ ప్రతిపద నుండి చతుర్థి వరకు చికిత్సలో భాగంగా దేవతల శరీర వస్త్రాలను తొలగించి కరాల కర్మను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోలుకోవడంతో దేవతా మూర్తుల శరీర భాగాలకు పూసిన కస్తూరి, గుగ్గిలం, చువా (సుగంధ ద్రవ్యం) మరియు చందనం, పట్టు పోగులు తొలగిస్తారు. ఇలా వేరు చేసిన పదార్థాలను ‘కరాళ‘ అంటారు.

శ్రీమందిరంలో రాజప్రసాద్ విజే

శ్రీమందిరంలో రాజప్రసాద్ విజే