
ప్రభుత్వ అధికారిక చిహ్నాల దుర్వినియోగం
భువనేశ్వర్: రాష్ట్రంలో కలహండి ప్రాంతంలో శిక్షణ కొనసాగిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి తన వ్యక్తిగత కారుపై ప్రత్యేక లైటు, ముందు భాగంలో ఐఏఎస్ ప్రొబేషనర్ రాతతో బోర్డు అమర్చడం వివాదాస్పదమైంది. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం అనధికారిక చర్యగా పరిగణిస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలన, ప్రజాభియోగాల విభాగం దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించింది. విభాగం అదనపు కార్యదర్శి కలహండి కలెక్టర్ను ఈ వివాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రొబేషనర్ ఏ అధికారం కింద ప్రైవేట్ వాహనంపై అలాంటి అధికారిక చిహ్నాన్ని ఉపయోగించారో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు.