నయాఘడ్‌ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం | - | Sakshi
Sakshi News home page

నయాఘడ్‌ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

Jun 20 2025 6:39 AM | Updated on Jun 20 2025 6:39 AM

నయాఘడ

నయాఘడ్‌ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

పర్లాకిమిడి: స్థానిక హైస్కూల్‌ జంక్షన్‌ వద్ద గురువారం సాయంత్రం నయాఘడ్‌ ఎమ్మెల్యే అరుణ్‌ సాహు దిష్టిబొమ్మను ట్రాన్స్‌జెండర్లు దహనం చేశారు. జూన్‌ 17న నయాగడ్‌ శాసనసభ్యులు అరుణ్‌ సాహు పూరీలో బహిరంగంగా బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి (మైచియా అని) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ట్రాన్స్‌జెండర్స్‌కు క్షమాపణలు చెప్పాలని జిల్లా కిన్నెరుల సంఘం అధ్యక్షుడు జాస్మిన్‌ షేక్‌ డిమాండ్‌ చేశారు. కిన్నెరులు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే 30 జిల్లాలల్ల సంఘంగా ఏర్పడి స్వతహాగా తమ కాళ్లపై నిలదొక్కుకుంటున్న సమయంలో శాసనసభ్యులు అరుణ్‌ సాహు ట్రాన్స్‌జెండర్స్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. నయాఘడ్‌ ఎమ్మెల్యే అరుణ్‌ సాహు క్షమాపణలు చెప్పకుంటే రాస్తారోకో ఆందోళన చేపడతామని, దీనికి మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయిక్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుదని జాస్మిన్‌ షేక్‌ అన్నారు. ఈ ఆందోళనలో మధుబోరాడో, స్వీటీ తదితరులు పాల్గొన్నారు.

నయాఘడ్‌ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం 1
1/1

నయాఘడ్‌ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement